మంగినపూడి బీచ్కు పోటెత్తిన భక్తులు...కానరాని ఏర్పాట్లు
ABN , First Publish Date - 2021-11-14T18:44:45+05:30 IST
కార్తీక శుద్ధ దశమి సందర్భంగా సముద్ర స్నానాలు ఆచరించేందుకు మచిలీపట్నం మంగినపూడి బీచ్కు భక్తులు పోటెత్తారు.
విజయవాడ: కార్తీక శుద్ధ దశమి సందర్భంగా సముద్ర స్నానాలు ఆచరించేందుకు మచిలీపట్నం మంగినపూడి బీచ్కు భక్తులు పోటెత్తారు. కాగా భక్తజన సందోహం కొరకు కనీస ఏర్పాట్లు చేయని పరిస్థితి నెలకొంది. కార్తీక శుద్ధ దశమి అందులోనూ ఆదివారం కావటం సముద్ర స్నానాలకు భక్తులు తరలి వచ్చారు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశాం అని చెబుతున్నా కనీసం మహిళలు బట్టలు మార్చుకుందుకు ఏర్పాట్లు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.