AP: ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్

ABN , First Publish Date - 2021-11-14T13:56:25+05:30 IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి సమీపంలో ఆదివారం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.

AP: ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి సమీపంలో ఆదివారం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో కండక్టర్‌తో సహా నలుగురు ప్రయాణికుతు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను చిన్నఆవుటపల్లి పిన్నమనేని హాస్పిటల్‌కు తరలించారు. ఆర్టీసీ బస్సు విజయవాడ నుండి గన్నవరం వస్తుండగా పార్వతిపురం నుండి విజయవాడ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. 

Updated Date - 2021-11-14T13:56:25+05:30 IST