AP: పరచివర ఎంపీటీసీ ఉపఎన్నికలో వైసీపీ నేతల హల్చల్
ABN , First Publish Date - 2021-11-16T15:02:31+05:30 IST
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరచివర ఎంపీటీసీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో వైసీపీ నేతలు హల్చల్ చేశారు.
విజయవాడ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరచివర ఎంపీటీసీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో వైసీపీ నేతలు హల్చల్ చేశారు. ఓటర్లకు పంచాల్సిన ఓటరు స్లిప్పులను తమ వద్ద ఉంచుకొన్న వైసీపీ నేతలు...తమ పార్టీకి అనుకూలమైన వారికి మాత్రమే స్లిప్పులు ఇస్తున్నారు. దీంతో ఓటరు స్లిప్పు లేకుండా ఓటు వేసేందుకు సిబ్బంది అనుమతించని పరిస్థితి. దీంతో అధికారుల తీరుపై ఓటర్లు, తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.