విజయవాడ కలెక్టర్ క్యాంప్ వద్ద స్వల్ప ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-11-16T16:33:38+05:30 IST

విజయవాడ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

విజయవాడ కలెక్టర్ క్యాంప్ వద్ద స్వల్ప ఉద్రిక్తత

విజయవాడ: విజయవాడ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థి సంఘాలు నాయకులపై పోలీసులు చేయి చేసుకున్నారు. పోలీసులు వ్యహరించిన తీరుపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  నిరసన తెలపడానికి వచ్చిన విద్యార్థి సంఘాల వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 42, 50, 51, 35లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్, టీఎన్‌ఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాలు నిరసనలో పాల్గొన్నాయి. 

Updated Date - 2021-11-16T16:33:38+05:30 IST