Ap: ఉయ్యూరులో రెండో రోజు విద్యార్థుల నిరసన
ABN , First Publish Date - 2021-11-16T17:39:36+05:30 IST
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో ఎయిడెడ్ కళాశాల ఏ.జి అండ్ ఎస్.జి యధాస్థితిగా కొనసాగాలని కోరుతూ రెండవ రోజు విద్యార్థులు నిరసనకు దిగారు.
విజయవాడ: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో ఎయిడెడ్ కళాశాల ఏ.జి అండ్ ఎస్.జి యధాస్థితిగా కొనసాగాలని కోరుతూ రెండవ రోజు విద్యార్థులు నిరసనకు దిగారు. నిరసన తెలిపేందుకు వచ్చిన ముగ్గురు ఎస్.ఎఫ్.ఐ లీడర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కళాశాల వద్ద రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు నిరసన తెలిపుతున్నారు. కళాశాలలోకి వెళ్లేందుకు విద్యార్థులను యాజమాన్యం అనుమతించలేదు. గోడలు దూకి మరి కళాశాలలోకి వెళ్లి విద్యార్థులు నిరసన చేపట్టారు. తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులను మద్దతు కోరగా తోటి విద్యార్థులు తరగతి గదులు వదిలి బయటకు వచ్చి నిరసనకు దిగారు. ఈ క్రమంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.