Krishna జిల్లాలో యువకుడు అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-11-20T13:37:51+05:30 IST

కృష్ణా జిల్లా మైలవరంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

Krishna జిల్లాలో యువకుడు అనుమానాస్పద మృతి

విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో జాతీయ రహదారిపై యువకుడి మృతదేహం పడి ఉంది. యువకుడి శరీరంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసుల మృతుడి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. యువకుడిని ఎవరైనా చంపి రోడ్డుపై పడేసారా? లేక... వాహనం డీ కొట్టిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 

Updated Date - 2021-11-20T13:37:51+05:30 IST