Vijayawada: వాట్సప్ గ్రూప్ ద్వారా శిశువు అమ్మకానికి యత్నం
ABN , First Publish Date - 2022-06-01T20:20:23+05:30 IST
వాట్సప్ గ్రూప్ ద్వారా మూడు రోజుల పసిపాపను అమ్మకానికి పెట్టిన వైనం ఆశ్చర్యానికి గురిచేసింది.
విజయవాడ: వాట్సప్ గ్రూప్ ద్వారా మూడు రోజుల పసిపాపను అమ్మకానికి పెట్టిన వైనం ఆశ్చర్యానికి గురిచేసింది. విషయం వెలుగులోకి రావడంతో చైల్డ్ లైన్ అధికారులకు పలువురు ఫిర్యాదు చేశారు. చిన్నారి అమ్మకంపై ఆర్ఎంపీ డాక్టర్ అమృతరావు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు అధికారులు గుర్తించారు. ఆర్ఎంపీ అమృతరావు జి.కొండూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.