విజయవాడ రేప్ కేసు నిందితులపై కఠిన చర్యలు: మంత్రి వనిత
ABN , First Publish Date - 2022-04-22T22:00:36+05:30 IST
విజయవాడ రేప్ కేసు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వనిత తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
విజయవాడ: విజయవాడ రేప్ కేసు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వనిత తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దిశ చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉందన్నారు. దిశ చట్టం అమలులో ఉంటే రేప్ కేసు నిందితులకు ఉరి పడేదన్నారు. అత్యాచార బాధితురాలికి మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. బాధితురాలికి రూ.10 లక్షల చెక్కు, ఇంటి స్థలం ఇచ్చామని తెలిపారు. బాధితురాలిని అన్ని విధాలుగా ఆదుకుంటామని తానేటి వనిత తెలిపారు.