విజయవాడలో పెరుగుతున్న కరోనా మరణాలు

ABN , First Publish Date - 2021-04-22T17:54:12+05:30 IST

నగరంలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా రోగుల మృతదేహాలతో శ్మశానాలు నిండిపోయాయి.

విజయవాడలో పెరుగుతున్న కరోనా మరణాలు

విజయవాడ: నగరంలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా రోగుల మృతదేహాలతో శ్మశానాలు నిండిపోయాయి. దీంతో అంత్యక్రియలకు ఆలస్యం అవుతోంది. కరోనా సోకడంతో అందరూ ఉన్నా అనాధల్లాగా కరోనా మృతదేహాలు పడి ఉన్న పరిస్థితి నెలకొంది. కరెంటు మిషన్ ద్వారా రోజుకు పది మృతదేహాలు మాత్రమే ఖననం చేస్తున్నారు.  అంత్యక్రియలు కూడా చేయలేని దుస్థితి ఏర్పడటంతో ఆత్మీయులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇతర శ్మశాన వాటికల్లో పుల్లలపై దహనం చేసే పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి కూడా మృతదేహాలను తగులపెడుతూ ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-04-22T17:54:12+05:30 IST