AP: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-15T16:16:29+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్ష మాల ధారణలు ప్రారంభమయ్యాయి.

AP: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు ప్రారంభం

విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్ష మాల ధారణలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం  ఈవో బ్రమరాంబ పూజా కార్యక్రమాలతో  భవానీ దీక్షలను ప్రారంభించారు. కార్తీక ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు మండల దీక్షా మాల ధారణలు  కొనసాగనున్నాయి. వచ్చే నెల 5 నుంచి 9 వరకు అర్ధమండల దీక్షలు జరుగనున్నాయి. డిసెంబర్ 25 నుంచి 29 వరకు భవానీ దీక్షా మాల విరమణలు కొనసాగనున్నాయి. దీక్షా పరుల కోసం దుర్గ గుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దుర్గగుడి వైదిక కమిటీ సభ్యుల సమక్షంలో  భవానీలు మాలలను స్వీకరించారు. 

Updated Date - 2021-11-15T16:16:29+05:30 IST