AP: ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన గిరిప్రదక్షణ
ABN , First Publish Date - 2021-11-19T15:15:47+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో గిరిప్రదక్షణ ఘనంగా ప్రారంభమైంది.
విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో గిరిప్రదక్షణ ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన గిరిప్రదక్షిణలో ఈవో భ్రమరాంబ, చైర్మన్ పైల సోమినాయుడు, ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శర్మ పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి ఆలయం చుట్టూ 8 కిలోమీటర్ల మేరకు గిరిప్రదక్షిణ చేయనున్నారు. గిరి ప్రదక్షణ కు రెండున్నర గంటల సమయం పట్టే అవకాశం ఉంది. గిరి ప్రదక్షిణలో దేవస్థాన ప్రచార రథంతో పాటు నడవలేని వారికి మినీ బస్సులను ఏర్పాటు చేశారు. ప్రదక్షిణ చేసే భక్తుల కోసం మెడికల్ క్యాంపు, ఉచిత ప్రసాదం, అంబులెన్స్లు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ గిరి ప్రదర్శన చేయవలసిందిగా ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.