ఇంటి కోసం దాచుకున్న డబ్బు చెదలపాలు
ABN , First Publish Date - 2021-02-17T00:34:01+05:30 IST
మైలవరంలో ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న డబ్బు చెదలపాలైంది. సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు జమలయ్య అనే పందుల వ్యాపారి ట్రంకు పెట్టెలో..
కృష్ణా: మైలవరంలో ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న డబ్బు చెదలపాలైంది. సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు జమలయ్య అనే పందుల వ్యాపారి ట్రంకు పెట్టెలో నగదు కూడబెట్టారు. మొత్తం రూ. 10 లక్షలు దాచి పెట్టి ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారు. అయితే జమలయ్య కలను చెదలు చెరిపేశాయి. మొత్తం రూ. 5 లక్షలు రూపాయలు ట్రంకు పెట్టెలో పెట్టి దాచి ఉంచారు. కొంత అవసరాల కోసం డబ్బు తీసేందుకు ట్రంకు పెట్టెను తెరిచారు. చూసి బిత్తరపోయారు. డబ్బుకు చెదలు పట్టి మొత్తం నోట్లన్నీ పాడైపోయాయి. కష్టపడి సంపాదించిన డబ్బు చిత్తు కాగితాల్లా కనిపించడంతో జమలయ్య కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.