AP News: గుడివాడలో టీడీపీ శ్రేణుల ర్యాలీ

ABN , First Publish Date - 2022-05-10T16:51:44+05:30 IST

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో అడ్డగోలు మట్టి తవ్వకాలను ఖండిస్తూ పురవీధుల్లో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.

AP News: గుడివాడలో టీడీపీ శ్రేణుల ర్యాలీ

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో అడ్డగోలు మట్టి తవ్వకాలను ఖండిస్తూ పురవీధుల్లో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. నందివాడ మండలం పుట్టగుంటలో ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు అడ్డుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. వైసీపీ మట్టి మాఫియా, ఎమ్మెల్యే కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన టీడీపీ శ్రేణులను కార్యాలయం గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. 

Read more