ఇంద్రకీలాద్రిపై అపచారం... ఆలయంలోకి దూసుకొచ్చిన చరణ్ అభిమానులు

ABN , First Publish Date - 2022-04-27T17:39:17+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో అపచారం జరిగింది.

ఇంద్రకీలాద్రిపై అపచారం... ఆలయంలోకి దూసుకొచ్చిన చరణ్ అభిమానులు

విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో అపచారం జరిగింది. సెక్యూరిటీ లోపంతో సినీ నటుడు రామ్ చరణ్ అభిమానులు ఆలయంలోకి దూసుకొచ్చారు. దుర్గ గుడి అంతరాలయంలో జై చరణ్ అంటూ నినాదాలు చేశారు. ఆలయంలో మొబైల్ ఫోన్లతో అభిమానులు వీడియోలు తీశారు. అభిమానుల తాకిడితో ఆలయం లోపల  రైలింగ్ రాడ్లు విరిగిపోయాయి. పోలీసులు, దుర్గ గుడి అధికారుల మధ్య సమన్వయం లోపం కారణంగా గందరగోళం నెలకొంది. క్యూ లైన్లలో తొక్కిసలాట జరిగింది. 

Updated Date - 2022-04-27T17:39:17+05:30 IST