AP News: రేపటి నుంచి శరన్నవరాత్రులు

ABN , First Publish Date - 2022-09-26T02:45:38+05:30 IST

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలకు సోమవారం అంకురార్పణ జరుగుతుంది.

AP News: రేపటి నుంచి శరన్నవరాత్రులు

విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలకు సోమవారం అంకురార్పణ జరుగుతుంది. అమ్మవారిని పది రోజుల్లో వివిధ అవతారాల్లో అలంకరిస్తారు. తొలిరోజున అమ్మవారిని శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అవతారంలో అలంకరిస్తారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారు ఈ రూపంలో దర్శనం ఇస్తారు. తెల్లవారుజామున మూడు గంటలకు అర్చకులు అమ్మవారిని మేల్కొలిపి స్నపనాభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం నైవేద్యం సమర్పించి హారతులు ఇస్తారు. తొలి దర్శనం గవర్నరు హరిచందన్‌, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చేసుకుంటారు. తదనంతరం సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రి విద్యుత్‌ వెలుగుల్లో దేదీప్యమానంగా కనిపిస్తుంది. కరోనా తర్వాత ఎలాంటి నిబంధనలు లేకుండా జరుగుతున్న తొలి శరన్నవరాత్రి మహోత్సవాలు ఇవి. రోజుకు 60-70 వేల మంది దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేశారు. 

Updated Date - 2022-09-26T02:45:38+05:30 IST