AP: కొండపల్లి మున్సిపాలిటీలో ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-11-20T15:40:17+05:30 IST

కొండపల్లి మున్సిపాలిటీలో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ తరఫున గెలిచిన అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసి తమ వైపు లాక్కోవాలని వైసీపీ నేతలు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

AP: కొండపల్లి మున్సిపాలిటీలో ఉత్కంఠ

విజయవాడ: కొండపల్లి మున్సిపాలిటీలో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ తరఫున గెలిచిన అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసి తమ వైపు లాక్కోవాలని వైసీపీ నేతలు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, వైసీపీ క్యాంప్ రాజకీయాలు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. టీడీపీ క్యాంపులో ఉన్న వారిపై తప్పుడు కేసులు పెట్టే ఆలోచనలో వైసీపీ నేతలు ఉన్నట్లు సమాచారం.  కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులకు గాను... చెరో 14 వార్డులను టీడీపీ, వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలిచి టీడీపీకి మద్దతు తెలిపారు. స్వతంత్ర వార్డు మెంబరు రాకతో టీడీపీ మెజారిటీ సాధించింది. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా టీడీపీ నుంచి ఎంపీ కేశినేని నాని, వైసీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు. 


Updated Date - 2021-11-20T15:40:17+05:30 IST