బాలినేని నివాసానికి వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు

ABN , First Publish Date - 2022-04-11T20:43:00+05:30 IST

బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి ప్రకాశం జిల్లా వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు తరలి వస్తున్నారు.

బాలినేని నివాసానికి వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు

విజయవాడ: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి ప్రకాశం జిల్లా వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు తరలి వస్తున్నారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత తన పదవికి రాజీనామా చేశారు. కొర్పొరేటర్లు కూడా రాజీనామా చేశారు.. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ చాలా మంది పాతవారిని కొనసాగించి.. బాలినేనిని తొలగించటం బాధాకరమన్నారు. కులాల సమీకరణాలు చూసినప్పుడు సీనియారిటీని పరిగణలోకి తీసుకోరా? అని ప్రశ్నించారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బాలినేని అండగా నిలబడ్డారని, బాలినేని ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా కట్టుబడి ఉంటామని సుజాత స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-11T20:43:00+05:30 IST