విజయవాడ అత్యాచార బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం

ABN , First Publish Date - 2022-04-22T21:27:37+05:30 IST

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రెండు రోజుల పాటు ఓ యువతిపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

విజయవాడ అత్యాచార బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం

విజయవాడ: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రెండు రోజుల పాటు ఓ యువతిపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించింది. ప్రభుత్వం తరపున బాధితురాలి కుటుంబానికి ఇల్లు కట్టి ఇస్తామని మంత్రి జోగి రమేష్ తెలిపారు. బాధితురాలి తల్లికి తగిన ఉద్యోగం ఇస్తామని చెప్పారు. నిందితులకు ఉరిశిక్ష పడేలా చూస్తామని ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు శవరాజకీయాలు చేయడం మానుకోవాలని జోగి రమేష్‌ సూచించారు. 


విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రెండు రోజుల పాటు ఓ యువతిపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. మానసిక స్థితి సరిగా లేని ఓ యువతిని పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో ఓ ఉద్యోగి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని, తాను పనిచేసే ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఎవరికీ తెలియకుండా ఆస్పత్రికి రప్పించి ఓ చిన్న గదిలో ఉంచాడు. ఆ యువకుడు, తోటి ఉద్యోగి, ఉద్యోగి స్నేహితుడు ముగ్గురూ ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


Updated Date - 2022-04-22T21:27:37+05:30 IST