Vijayawadaలో ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన...అరెస్ట్

ABN , First Publish Date - 2021-11-15T17:00:36+05:30 IST

ఎయిడెడ్ విద్యా సంస్థలు యధావిధిగా కొనసాగించాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన చేపట్టింది.

Vijayawadaలో ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన...అరెస్ట్

విజయవాడ: ఎయిడెడ్ విద్యా సంస్థలు యధావిధిగా కొనసాగించాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన చేపట్టింది. మాంటిస్సోరి పాఠశాల లోపలకు వెళ్లేందుకు యత్నించగా...పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ... బిషప్ హజరయ్య స్కూల్ సందర్శనకు వస్తే అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తాంబూలాలు ఇచ్చాం...తన్నుకు చావండి అన్న విధంగా ప్రభుత్వం తీరు ఉందన్నారు. 42, 50 జీవోలను వెంటనే రద్దు చేసి ఎయిడెడ్ విద్యా సంస్థలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా.. ఎయిడెడ్ విద్యా సంస్థలు యధావిధిగా కొనసాగించే వరకు తమ పోరాటం ఆపేది లేదని ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-11-15T17:00:36+05:30 IST