హోమం ప్రభావంతోనే వెండి సింహాల దొంగ దొరికాడు: స్వాత్మా నందేంద్ర

ABN , First Publish Date - 2021-01-25T18:59:45+05:30 IST

పూర్ణాహుతితో చతుర్వేద హోమం ముగిసిందని శ్రీ శ్రీ శ్రీ స్వాత్మా నందేంద్ర స్వామిజీ తెలిపారు.

హోమం ప్రభావంతోనే వెండి సింహాల దొంగ దొరికాడు: స్వాత్మా నందేంద్ర

విజయవాడ: పూర్ణాహుతితో చతుర్వేద హోమం ముగిసిందని శ్రీ శ్రీ శ్రీ స్వాత్మా నందేంద్ర స్వామిజీ తెలిపారు. 7 రోజులు పాటు వైభవంగా జరిగిన సప్తహ హావనం ముగిసిందని చెప్పారు. చతుర్వేద హోమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని అన్నారు.హోమం ప్రభావం వల్లనే వెండి సింహల దొంగ దొరికినట్లు భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చతుర్వేద హోమం విజయవాడలోనే కాకుండా  కాళహస్తి, శ్రీశైలం, కాణిపాకంలో కూడా నిర్వహించటం సంతోషంగా ఉందని స్వాత్మా నందేంద్ర స్వామిజీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-25T18:59:45+05:30 IST