Vijayawada: పట్టాభి ఇంటికి పోలీసులు.. మీడియాను చూసి ఏం చేశారంటే..
ABN , First Publish Date - 2022-07-21T00:47:24+05:30 IST
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్(TDP National Spokesperson Kommareddy Pattabhiram) ఇంటికి వన్టౌన్ పీఎస్ పోలీస్ అధికారులు వెళ్లారు. ...
విజయవాడ (Vijayawada): టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్(TDP National Spokesperson Kommareddy Pattabhiram) ఇంటికి వన్టౌన్ పీఎస్ పోలీస్ అధికారులు వెళ్లారు. 41 ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు యత్నించారు. అయితే మీడియా ప్రతినిధులను చూసి నోటీసులు ఇవ్వకుండానే వెనుతిరిగారు. ఈ ఘటనపై స్పందించిన పట్టాభిరామ్ వన్ టౌన్ పోలీసులు తనకు 41 ఏ కింద నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. తాను ఇంటి వద్దే ఉన్నానని, నోటీసులు ఇవ్వొచ్చని ఆయన సూచించారు. తనపై ఇప్పటికే చాలాసార్లు భౌతికదాడులు జరిగాయని.. మీడియా ఉంటే నోటీసులు ఇవ్వడానికి ఎందుకు జంకుతున్నారని పట్టాభి ప్రశ్నించారు.