ఆ హైవే పూర్తయితే.. 5 గంటల్లో విజయవాడ నుంచి బెంగళూరుకు
ABN , First Publish Date - 2022-10-01T09:55:39+05:30 IST
బెంగళూరు నుంచి కడప మీదుగా విజయవాడకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం 2025-26 నాటికి పూర్తికావొచ్చని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
బెంగళూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు నుంచి కడప మీదుగా విజయవాడకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం 2025-26 నాటికి పూర్తికావొచ్చని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రూ.13,600 కోట్ల వ్యయంతో 342 కి.మీ. పొడవున నిర్మించనున్న ఈ రహదారి పూర్తయితే బెంగళూరు-విజయవాడ మధ్య ప్రయాణ సమయం 5 గంటలకు తగ్గిపోతుందని చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు.