CM వెంటే విజయేంద్ర...

ABN , First Publish Date - 2022-02-03T17:55:09+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప తనయుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్రకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై బుధవారం అధిక ప్రాధాన్యతనివ్వడం రాజకీయంగా కుతూహలం రేకెత్తిస్తోంది.

CM వెంటే విజయేంద్ర...

- సర్వత్రా కుతూహలం   

- కేబినెట్‌లో చోటుపై చర్చలు


బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప తనయుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్రకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై బుధవారం అధిక ప్రాధాన్యతనివ్వడం రాజకీయంగా కుతూహలం రేకెత్తిస్తోంది. మల్లేశ్వరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి సీఎం కారులోనే విజయేంద్ర కూడా రావడం, ప్రధాని మోదీ వర్చువల్‌ సమావేశాన్ని సీఎంతో పాటు మొదటి వరుసలోనే కూర్చుని తిలకించడం విశేషం. సీఎం మీడియాతో మాట్లాడిన సమయంలోనూ విజయేంద్ర పక్కనే ఉన్నారు. ఒకింత దూరంగా నిలబడ్డ విజయేంద్రను సీఎం పిలిచి మరీ పక్కన నిలబెట్టించడం విశేషం. సీఎం బొమ్మై సోమవారం ప్రధాని మోదీతో పాటు అధిష్ఠానం పెద్దలను కలిసేందుకు వెళుతున్న నేపథ్యంలో ఈ తాజా పరిణామాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బొమ్మై నాయకత్వాన్ని మార్చేందుకు బదులు యడియూరప్ప పుత్రరత్నాన్ని కేబినెట్‌లోకి తీసుకుని కీలక మంత్రిపదవిని అప్పగిస్తే అంతా సర్దుకుంటుందని అధిష్ఠానం పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదైమైనా మంత్రివర్గ విస్తరణలో విజయేంద్రకు పదవి ఖాయమని వినిపిస్తోంది.

Updated Date - 2022-02-03T17:55:09+05:30 IST