Telangana: తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన కారు లభ్యం

ABN , First Publish Date - 2021-08-30T13:40:30+05:30 IST

జిల్లాలోని మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో గత రాత్రి కొట్టుకుపోయిన కారు లభ్యమైంది. కాగా కారులో ఉన్న నలుగురు గల్లంతయ్యారు.

Telangana: తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన కారు లభ్యం

వికారాబాద్: జిల్లాలోని మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో గత రాత్రి కొట్టుకుపోయిన కారు లభ్యమైంది. కాగా కారులో ఉన్న నలుగురు గల్లంతయ్యారు.  వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు తెలిపారు. కొట్టుకుపోయిన కారులో నవ వధువు ప్రవళిక, డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి, శ్వేత, ఎనిమిది సంవత్సరాల ఇషాంత్ రెడ్డి ఉన్నారు.


జిల్లాలోని మర్పల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన నవాజ్‌రెడ్డి, ప్రవళిక నవ దంపతులు. ఈనెల 25న వారికి వివాహమైంది. ఆదివారం ఉదయం నవాజ్‌రెడ్డి భార్య ప్రవళిక, తన అక్కలు రాధ, శ్వేత, ఆమె కుమారుడు ఇషాంత్‌రెడ్డి (8), డ్రైవర్‌ రాఘవేందర్‌రెడ్డిలతో కలిసి కారులో మోమిన్‌పేట్‌లోని అత్త వారింటికి వెళ్లారు. సాయంత్రం రావులపల్లికి తిరిగొస్తూ ఉధృతంగా ప్రవహిస్తున్న తిమ్మాపూర్‌ వాగును దాటేందుకు యత్నించారు. ప్రవాహ వేగానికి వారు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. కారు తలుపు తెరుచుకుని బయట పడ్డ నవాజ్‌రెడ్డి, రాధ చేతికి అందిన చెట్ల కొమ్మలు పట్టుకోగా గ్రామస్తులు వారిని రక్షించారు.

Updated Date - 2021-08-30T13:40:30+05:30 IST