తాండూరులో అదృశ్యమైన సత్యమూర్తి సేఫ్: SP kotireddy

ABN , First Publish Date - 2022-06-28T19:46:39+05:30 IST

తాండూరులో అదృశ్యమై బీఎస్పీ అధ్యక్షుడు దొరిశెట్టి సత్యమూర్తి సేఫ్‌గా ఉన్నారని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

తాండూరులో అదృశ్యమైన సత్యమూర్తి సేఫ్: SP kotireddy

వికారాబాద్: తాండూరులో అదృశ్యమై బీఎస్పీ అధ్యక్షుడు దొరిశెట్టి సత్యమూర్తి(Satymurti) సేఫ్‌గా ఉన్నారని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ... సత్యమూర్తి ఫోన్ ఆఫ్ చేయడంతో కారు నెంబర్ ఆధారంగా కాశీలో గుర్తించి... సురక్షితంగా తీసుకువచ్చామని అన్నారు. సత్యమూర్తి భార్య అన్నపూర్ణ కేసును కూడా త్వరలోనే చేధిస్తామని చెప్పారు. ఏఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడతామన్నారు. కాగా...  సత్యమూర్తి వీడియోలో పెద్ద తలకాయల పేర్లపై మీడియా వేసిన ప్రశ్నలకు ఎస్పీ సమాధానం దాటవేశారు. కేసుకు సంబంధించి పూర్తి విషయాలను మీడియా ముందు వివరించడం కుదరదని చెప్పుకొచ్చారు. సత్యమూర్తి చేసిన ఆరోపణలు కూడా అబద్ధం కావచ్చన్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. 


కాగా... వికారాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు దొరిశెట్టి సత్యమూర్తి భార్య అన్నపూర్ణ మూడు నెలల క్రితం సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. భార్య కనిపించకుండా పోవడంపై సత్యమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా... తన భార్య అదృశ్యమై మూడు నెలలు గడుస్తున్నప్పటికీ పోలీసులు ఆచూకీ కనిపెట్టలేదని ఆరోపించారు. 48 గంటల్లో కేసును చేధించకపోతే ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటామంటూ  ఓ సెల్ఫీవీడియా విడుదల చేసి సత్యమూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు సత్యమూర్తి కోసం గాలించారు. చివరకు కాశీలో ఉన్నట్లు గుర్తించి అక్కడి నుంచి ఆయనను సురక్షితంగా వికారాబాద్‌కు తీసుకువచ్చినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-06-28T19:46:39+05:30 IST