Vikarabad: విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా...

ABN , First Publish Date - 2021-11-22T16:04:44+05:30 IST

జిల్లాలోని కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.

Vikarabad: విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా...

వికారాబాద్: జిల్లాలోని కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను స్థానికులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో మొత్తం ఇరవై మంది విద్యార్థున్నట్లు సమాచారం. విద్యార్థులంతా ముజాహిద్‌పూర్ మోడల్ స్కూలుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

Updated Date - 2021-11-22T16:04:44+05:30 IST