Vikarabad: మద్యం మత్తులో తమ్మున్ని చంపిన అన్న

ABN , First Publish Date - 2022-01-01T18:29:39+05:30 IST

జిల్లాలోని ఆలంపల్లిలో దారుణం చోటు చేసుకుంది.

Vikarabad: మద్యం మత్తులో తమ్మున్ని చంపిన అన్న

వికారాబాద్: జిల్లాలోని ఆలంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో సొంత తమ్ముడిని అన్న చంపేశాడు. మృతుడు ఆలంపల్లిలో నివాసం ఉంటున్న గోవర్ధన్ రెడ్డిగా గుర్తించారు. కొత్త సంవత్సరం వేడుకలు ముగించుకొని ఇంటికి వచ్చిన తమ్ముడుతో అన్న గొడవకు దిగాడు. ఈ క్రమంలో స్క్రూడ్రైవర్‌తో తమ్ముడిని అన్న అంజిరెడ్డి పొడిచి చంపాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-01-01T18:29:39+05:30 IST