కొవిడ్‌ చికిత్సా కేంద్రంగా వికాస్‌ కళాశాల

ABN , First Publish Date - 2021-05-07T05:19:05+05:30 IST

కరోనా రోగులకు సేవలందించే ందుకు షీలానగర్‌ వికాస్‌ కళాశాల సన్నద్ధమవుతున్నది.

కొవిడ్‌ చికిత్సా కేంద్రంగా వికాస్‌ కళాశాల
షీలానగర్‌లోని వికాస్‌ కళాశాలలో వైద్యాధికారులతో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి

అక్కిరెడ్డిపాలెం, మే 6: కరోనా రోగులకు సేవలందించే ందుకు షీలానగర్‌ వికాస్‌ కళాశాల సన్నద్ధమవుతున్నది. ప్రగతి భారతి ట్రస్టు ఆధ్వర్యంలో సుమారు 300 పడకల ఆక్సిజన్‌ బెడ్స్‌తో ఏర్పాటు చేస్తున్న ఈ కరోనా చికిత్స కేంద్రాన్ని గురువారం ఎంపీ విజయసాయిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వైద్యాధికారులతో, ట్రస్ట్‌ సభ్యులతో ఆయన ఏర్పాట్లపై చర్చించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 300 వరకు ఆక్సిజన్‌ బెడ్‌లు ఏర్పాటు  చేస్తున్నారు. భాధితులకు  కరోనా పరీక్షలు, మందులు, ఆహారం వంటివి కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు, ఈ కేంద్రం ఈ నెల 10వ తేదీ నుంచి సేవలందించేదుకు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ సత్యనారాయణ, కరోనా స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుధాకర్‌, జీవీఎంసీ పీడీ శ్రీనివాస్‌, గాజువాక జడ్‌సీ శ్రీధర్‌, వైసీపీ గాజువాక ఇన్‌చార్జి తిప్పల దేవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-07T05:19:05+05:30 IST