మంత్రిని కలిసిన రావిచెడ్‌ గ్రామస్థులు

ABN , First Publish Date - 2022-10-02T04:57:33+05:30 IST

మంత్రిని కలిసిన రావిచెడ్‌ గ్రామస్థులు

మంత్రిని కలిసిన రావిచెడ్‌ గ్రామస్థులు
మంత్రికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న గోపాల్‌

కడ్తాల్‌, అక్టోబరు 1: ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి, రావిచెడ్‌ ఎంపీటీసీ బొప్పిడి గోపాల్‌ శనివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈనెల 3న కడ్తాల మండలం రాడిచెడ్‌లో నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలకు ఆహ్వానించారు. మంత్రిని కలిసిన వారిలో ఉపసర్పంచ్‌ వెంకటేశ్‌, వార్డుసభ్యులు పవన్‌కుమార్‌, మల్లేశ్‌యాదవ్‌, బాలకృష్ణ, లింగం, ఉన్నారు.  

Updated Date - 2022-10-02T04:57:33+05:30 IST