AP News: కృష్ణా జిల్లా, తెంపల్లిలో గ్రామస్తుల ఆందోళన
ABN , First Publish Date - 2022-07-20T18:17:14+05:30 IST
గన్నవరం (Gannavaram) మండలం, తెంపల్లి గ్రామంలో స్థానికులు ఆందోళన (Protest) చేపట్టారు.
కృష్ణా జిల్లా (Krishna Dist.): గన్నవరం (Gannavaram) మండలం, తెంపల్లి గ్రామంలో స్థానికులు ఆందోళన (Protest) చేపట్టారు. గ్రామంలో మంచి నీరు కలుషితంతో ఐదుగురు మృతి (Five people died) చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా (Collector Ranjit Bhasha) గ్రామానికి చేరుకుని వీదుల్లో పర్యటించారు. అనంతరం అధికారులు సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే మంచి నీటి పైప్ లైన్ (Pipe line) పనులు ప్రారంభించాలని ఆర్డబ్ల్యూఎస్ (RWS) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే అధికారులు తాత్కాలిక పనులు ప్రారంభించారు. ఇలా తాత్కాలిక పనులు చేసి చేతులు దులుపుకుంటే.. మళ్ళీ అనారోగ్య సమస్య తలెత్తితే ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటని గ్రామస్తులు ప్రశ్నించారు. శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఫ్ల కార్డులు పట్టుకొని బైటాయించారు. గ్రామ సమస్యలు వెంటనే పరిష్కారించాలని నినాదాలు చేశారు. అధికారులు వచ్చి గ్రామానికి న్యాయం చేసేవరకు ధర్నా విరమించేది లేదంటూ గ్రామస్తులు స్పష్టం చేశారు.