బాలికపై అత్యాచారం.. నిందితులను చితకబాది.. సజీవంగా నిప్పంటించిన గ్రామస్తులు

ABN , First Publish Date - 2022-06-10T08:35:34+05:30 IST

ఒక మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. విషయం తెలిసిన గ్రామస్తులు ఆ యువకులను చితకబాది.. వారిపై కిరోసిన పోసి నిప్పంటించారు. ఈ ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలో జరిగింది...

బాలికపై అత్యాచారం.. నిందితులను చితకబాది.. సజీవంగా నిప్పంటించిన గ్రామస్తులు

ఒక మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. విషయం తెలిసిన గ్రామస్తులు ఆ యువకులను చితకబాది.. వారిపై కిరోసిన పోసి నిప్పంటించారు. ఈ ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలో జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. గుమ్లా జిల్లాలోని ఒక గ్రామంలో నివసించే ఒక బాలిక తన తండ్రితో కలిసి పక్క గ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లింది. పెళ్లి కార్యక్రమం ముగిసిన తరువాత తండ్రితో ఇంటికి బయలుదేరిన ఆమెకు రాత్రివేళ బస్సులు దొరకలేదు. ఆ సమయంలో ఆమె గ్రామానికే చెందిన ఇద్దరు యువకులు బైక్‌‌పై వెళుతుండగా.. వారితో వెళ్లమని ఆమె తండ్రి చెప్పాడు. ఆ ఇద్దరు యువకులు ఆమెను బైక్‌పై తీసుకొని గ్రామానికి బయలుదేరారు. కానీ మార్గమధ్యలో ఆమెపై అత్యాచారం చేసి.. ఆ తరువాత ఇంటికి తీసుకెళ్లారు. 


ఇంటికి వెళ్లిన తరువాత బాలిక జరిగిన విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి ఆ ఇద్దరు యువకులను చితకబాదారు. ఆ తరువాత వారిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో ఆ ఇద్దరిలో ఒక యువకుడు మరణించగా.. మరొక యువకుడు ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో ఉన్నాడు.

Updated Date - 2022-06-10T08:35:34+05:30 IST