పల్లె ప్రగతితో గ్రామాల్లో నూతన శోభ: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-03-14T00:38:59+05:30 IST

పల్లెప్రగతితో గ్రామాలు నూతనశోభను సంతరించుకున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

పల్లె ప్రగతితో గ్రామాల్లో నూతన శోభ: ఎర్రబెల్లి

చేవెళ్ల: పల్లెప్రగతితో గ్రామాలు నూతనశోభను సంతరించుకున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, డంపింగ్‌యార్డులు, వైకంఠదామాల వంటి అనేక సౌకర్యాలు గ్రామాల్లో కల్పిస్తున్నట్లు తెలిపారు. రూ.7,289కోట్ల నిధులతో మన ఊరు-మనబడి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మొదటి దశలో 9123 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలు, చిరువ్యాపారులు చేసుకునేందుకు రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తోందని తెలిపారు. అన్ని శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు దయాకర్‌ రావు తెలిపారు. 

Updated Date - 2022-03-14T00:38:59+05:30 IST