Tension condition: వినాయక మండపం వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యేకు చేదు అనుభవం

ABN , First Publish Date - 2022-09-01T03:05:19+05:30 IST

మదనపల్లి మండలం మాలపాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వినాయక చవితి మండపం ఎదుట వైసీపీ నేతలు...

Tension condition: వినాయక మండపం వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యేకు చేదు అనుభవం

అన్నమయ్య: మదనపల్లి మండలం మాలపాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వినాయక చవితి (Vinayaka Chavithi)మండపం ఎదుట వైసీపీ నేతలు (Ycp Leaders) బ్యానర్లు కట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలు (Tdp Followers), గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. ఈ సమయంలో వినాయకుడి దర్శనానికి మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా వచ్చారు. ఎమ్మెల్యేను చూసి వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. స్థానిక టీడీపీ నాయకులపై కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ నాయకులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే వారిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


అయితే ఈ ఘటనతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే నవాజ్ బాషాను కదలనివ్వకుండా చుట్టుముట్టారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేకు రక్షణ కావచంగా నిలబడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం ఎమ్మెల్యేను అక్కడి నుంచి తరలించేంచారు. 


Updated Date - 2022-09-01T03:05:19+05:30 IST