Sakshi reporter Vs YCP: పోలీసుల ఎదుటే కొట్టుకున్న సాక్షి విలేకరి, వైసీపీ నేతలు
ABN , First Publish Date - 2022-08-30T15:24:50+05:30 IST
జిల్లాలోని వింజమూరు పోలీస్స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది.
నెల్లూరు: జిల్లాలోని వింజమూరు పోలీస్స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. స్టేషన్లోనే సాక్షి పత్రికా విలేకరి భాస్కర్ రెడ్డి, మేకపాటి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పాత విభేదాలతో ఫిర్యాదు చేసేందుకు రెండు వర్గాలు గత రాత్రి స్టేషన్కు వచ్చాయి. కాగా ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి స్టేషన్లోనే ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఇంత జరుగుతున్నప్పటకీ పోలీసులు మాత్రం చేష్టలుడిగి చూస్తుండిపోయారు. రాత్రి గొడవ జరిగినప్పటికీ కేసు నమోదు చేసేందుకు తాస్కారం చూపారు. కాగా... ఘర్షణ వీడియోలు బయటకి రావడంతో పోలీసులు హడావిడిగా ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. మరోవైపు పోలీసుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.