TS News: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన టీఆర్ఎస్ బృందం...
ABN , First Publish Date - 2022-10-06T18:02:32+05:30 IST
కేంద్ర ఎన్నికల సంఘాన్ని గురువారం తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ బృందం కలిసింది.
ఢిల్లీ (Delhi): కేంద్ర ఎన్నికల సంఘాన్ని గురువారం తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinodkumar) బృందం కలిసింది. టీఆర్ఎస్ (TRS) పేరును భారత్ రాష్ట్ర సమితి (BRS)గా మార్చుతూ నిన్న పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని సీఈసీ(CEC)కి తెలిపారు. భారత్ రాష్ట్ర సమితి పేరును నమోదు చేయాలని వినతి చేశారు. అలాగే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా చేసిన తీర్మాన కాపీ, కేసీఆర్ లేఖను అందజేశారు. అనంతరం వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ తీర్మానం కాపీని సీఈసీ డిప్యూటీ కమిషనర్ ధర్మేంద్ర శర్మకు అందజేశామన్నారు. సీఈసీ త్వరలోనే తమ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 29ఎ ప్రకారం.. ఒక రాజకీయ పార్టీ పేరు మార్చుకోవచ్చునని, టీఆర్ఎస్ పేరును మాత్రమే బిఆర్ఎస్గా మార్చామని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయిన తన పార్టీ పేరు, అడ్రస్ మార్చుకున్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుందని వినోద్కుమార్ అన్నారు.