కర్మకాండలకు వెళ్లొచ్చేసరికి ఇంట్లో చోరీ
ABN , First Publish Date - 2021-05-09T05:40:40+05:30 IST
పట్టణంలోని విష్ణుకుండినగర్ సమీపంలో ఓ ఇంట్లో దొంగలు పడి సుమారు రూ.3 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, వస్తువులు, నగదు దోచుకెళ్లిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
వినుకొండటౌన్, మే 8 : పట్టణంలోని విష్ణుకుండినగర్ సమీపంలో ఓ ఇంట్లో దొంగలు పడి సుమారు రూ.3 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, వస్తువులు, నగదు దోచుకెళ్లిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ రాజ్యలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ద్విచక్రవాహన షోరూమ్లో పనిచేస్తున్న వ్యక్తి ఇటీవల కొవిడ్తో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో కర్మకాండలను చేసేందుకు కుటుంబసభ్యులు స్వగ్రామానికి వెళ్లారు. గమనించిన దొంగలు శుక్రవారం రాత్రి ఇంట్లో విలువైన ఎలక్ర్టికల్ సామాన్లు, రూ.50వేలు నగదును, బంగారు ఆభరణాలతో కలిపి సుమారు రూ.3లక్షలు విలువ చేసే సొత్తును దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రాజ్యలక్ష్మి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.