లారీ-బస్సు ఢీ.. 19 మందికి గాయాలు

ABN , First Publish Date - 2021-01-22T05:58:33+05:30 IST

వినుకొండ మండలంలోని చీకటీగలపాలెం అడ్డరోడ్డు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఎదురుగా వెళ్తున్న లారీని ఢీకొన్నది.

లారీ-బస్సు ఢీ.. 19 మందికి గాయాలు
నుజ్జునుజ్జయిన బస్సు

వినుకొండ టౌన్‌, జనవరి 21: వినుకొండ మండలంలోని చీకటీగలపాలెం అడ్డరోడ్డు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఎదురుగా వెళ్తున్న లారీని ఢీకొన్నది. దీంతో 19 మంది గాయపడ్డారు. కారంపూడి నుంచి నంద్యాల వెళ్తున్న పైపుల లారీని వేగంగా ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో తెలంగాణలోని కామారెడ్డి డిపో నుంచి నెల్లూరు జిల్లా వింజమూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. బస్సు డ్రైవర్‌ పరంధామంతో పాటు మరో 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 108 సిబ్బంది క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం బస్సు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-22T05:58:33+05:30 IST