అఫ్ఘానీలతో కిక్కిరిసిపోయిన మిలిటరీ విమానం! జనరల్ బోగీని తలపిస్తున్న షాకింగ్ దృశ్యం!

ABN , First Publish Date - 2021-08-17T21:21:07+05:30 IST

పైన ఫొటోలో కనిపిస్తున్నది జనరల్ రైలు బోగీకాదు! కాందిశీకుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక శరాణార్థ శిబిరం అంతకన్నా కాదు. అది ఓ మిలిటరీ విమానం. అఫ్ఘానీలతో కిక్కిరిసిపోయిన విమానం.

అఫ్ఘానీలతో కిక్కిరిసిపోయిన మిలిటరీ విమానం! జనరల్ బోగీని తలపిస్తున్న షాకింగ్ దృశ్యం!

ఇంటర్నెట్ డెస్క్: పైన ఫొటోలో కనిపిస్తున్నది ప్రయాణికులతో నిండిపోయిన జనరల్ రైలు బోగీకాదు! కాందిశీకుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక శరాణార్థ శిబిరం అంతకన్నా కాదు. అది ఓ మిలిటరీ విమానం.. ప్రాణభయంతో పారిపోతున్న అఫ్ఘానీలతో కిక్కిరిసిపోయిన విమానం. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు కాబూల్ విమానాశ్రయంలో అఫ్ఘానీలు తమ కంటికి కనిపించిన విమానం ఎక్కేసిన విషయం తెలిసిందే. కొన్ని విమానాల్లో ఏకంగా 640 మంది వరకూ ఒకేసారి ప్రయాణించారట. సరిహద్దులన్నీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో..అఫ్ఘానీలు దేశం నుంచి బయటపడేందుకు విమానాలే దిక్కయ్యాయి. 


ఈ క్రమంలో అనేక మంది విమానం నుంచి వేళ్లాడుతూ ప్రయాణించేందుకూ వెరవలేదు. తాలిబన్ల భయం వారిని విచక్షణ మరిచిపోయేలా చేసింది. ప్రాణభయంతో వారు ఇలా అపాయానికి ఎదురెళ్లారు. అదృష్టం బాగుండి విమానాల్లో చోటు దొరికిన వారు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో పుట్టిన దేశాన్ని విడిచివెళ్లిపోయారు. కొందరు అభాగ్యులు మాత్రం విమానం నుంచి జారిపడి ప్రాణాలు కూడా కోల్పోయారు. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతూ నెటిజన్ల చేత కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇవి మానవ సమాజం తలదించుకోవాల్సిన దృశ్యాలని అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అఫ్ఘాన్ ప్రజల ఈ దుస్థితికి కారణమెవరని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2021-08-17T21:21:07+05:30 IST