ఖాళీ స్టేడియంలో కోహ్లీ వందో టెస్ట్!

ABN , First Publish Date - 2022-02-27T01:32:48+05:30 IST

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వందో టెస్టు మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న అతడి అభిమానులకు

ఖాళీ స్టేడియంలో కోహ్లీ వందో టెస్ట్!

మొహాలీ: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వందో టెస్టు మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న అతడి అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్తే. మార్చి 4న మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరుగనున్న తొలి టెస్టు మ్యాచ్ కోహ్లీకి వందోది. ఈ టెస్టుకు ప్రేక్షకులను అనుమతించట్లేదని పీసీఏ సీఈవో దీపక్ శర్మ తెలిపారు. శ్రీలంకతో రెండో టెస్టు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. 


భారత టెస్టు జట్టుకు తొలిసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టబోతున్న రోహిత్ శర్మ కెప్టెన్సీలో కోహ్లీ తన వందో టెస్టు మ్యాచ్ ఆడనుండడం గమనార్హం. ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన కోహ్లీ 50.39 సగటుతో 7,962 పరుగుుల సాధించాడు. అందులో 27 సెంచరీలు ఉన్నాయి. 

Updated Date - 2022-02-27T01:32:48+05:30 IST