బిగ్ బ్రేకింగ్: టెస్ట్ కెప్టెన్సీకి కూడా విరాట్ కోహ్లీ గుడ్ బై
ABN , First Publish Date - 2022-01-16T00:35:03+05:30 IST
విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ విషయం తెలుపుతూ ఆయన ట్విట్టర్లో ఒక మేసేజ్ను షేర్ చేశాడు. అంతకు ముందు వన్ డే, టీ-20 క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో ఘోర పరాభవం ఎదురు కావడంతో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
‘‘ టీమీండియాను సరి అయిన దిశలో నడిపించడానికి అలుపెరగకుండా 7ఏళ్లు పనిచేశాను. నీతి, నిజాయతీతో నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. ప్రతి పనికి ఒక ముగింపు ఉంటుంది. నాకు సంబంధించినంత వరకు టీమీండియా టెస్ట్ కెప్టెన్సీ ఆ ముగింపు. ఈ ప్రయాణంలో నాకు అనేక ఆటు పోట్లు ఎదురయ్యాయి. నేను ఎప్పుడు కూడా నమ్మకాన్ని కోల్పోలేదు. ప్రతి పనిలో 120శాతం ఇవ్వాలనుకున్నాను. అందుకోసం నిర్విరామంగా పనిచేశాను. నాకు ఇన్ని ఏళ్లు కెప్టెన్సీ అవకాశం ఇచ్చినందుకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)కు థ్యాంక్స్. నా విజన్ని ఆచరణలోకి తీసుకు వచ్చినందుకు టీమ్ మేట్స్కు అందరికి కూడా కృతజ్ఞతలు. ప్రతి రోజు టీమ్కు అండగా నేను ఉన్నాను. ఏ సమయంలోను ఓటమిని అంగీకరించలేదు. ఈ ప్రయాణాన్ని టీమ్ మేట్స్ అందరు నాకు తీపి జ్ఞాపకంగా మిగిల్చారు ’’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు.
‘‘ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు నాకు ఎంతో మంది అండగా నిలిచారు. టెస్ట్ క్రికెట్ను ముందుకు తీసుకు వెళ్లడానికి రవిశాస్త్రితో పాటు అనేక మంది నన్ను వెనుక నుంచి నడిపించారు. నా విజన్ని ఆచరణలోకి తీసుకురావడానికి కృషి చేశారు. ఇండియన్ క్రికెట్ను ముందుకు తీసుకు వెళ్లడానికి ఎమ్.ఎస్.ధోనీనే నన్ను గుర్తించాడు. అతడు కెప్టెన్గా నాపై ఎంతో నమ్మకముంచాడు. ధోనీకి బిగ్ థ్యాంక్ యూ’’ అని కోహ్లీ వివరించాడు.
2014-15లో ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో ధోనీ నాయకత్వ బాధ్యతలనుంచి వైదొలగడంతో కోహ్లీ టెస్ట్ జట్టు కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఆపై రెండేళ్లకు పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతలను కూడా వదులుకోవాలని మహీ నిర్ణయించుకోవడంతో 2017లో విరాట్ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్గా నియమితుడయ్యాడు. కోహ్లీ పగ్గాలు చేపట్టాక అతిపెద్ద టోర్నీ చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో దాయాది పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోయింది.
సారథిగా ధోనీకంటే కోహ్లీకే విజయశాతం మెరుగ్గా ఉండడం విశేషం. విరాట్ సారథ్యంలో భారత్ 45 టీ20 మ్యాచ్ల్లో తలపడితే 27 విజయాలు సాధించింది. 2 మ్యాచ్లు టై కాగా.. మరో రెండు ర ద్దయ్యాయి. అంటే.. 65.11 శాతం అన్నమాట. విరాట్ నాయకత్వంలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా అందుకోలేకపోయినా.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్లలో జట్టు సిరీస్లు గెలుచుకోవడం విశేషం.