ఏబీ.. ఏబీ అంటూ నినదించిన అభిమానులు.. కోహ్లీ రిప్లై వైరల్!

ABN , First Publish Date - 2022-03-13T22:28:56+05:30 IST

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ మైదానంలో ఉంటే చాలా ఫ్యాన్స్‌కు పండగే. రకరకాలుగా వారిని ఉత్సాహపరుస్తూ..

ఏబీ.. ఏబీ అంటూ నినదించిన అభిమానులు.. కోహ్లీ రిప్లై వైరల్!

బెంగళూరు: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ మైదానంలో ఉంటే చాలు ఫ్యాన్స్‌కు పండగే. రకరకాలుగా వారిని ఉత్సాహపరుస్తూ ఉంటాడు. ప్రస్తుతం శ్రీలంకతో బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టులోనూ అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ.. బెంగళూరును తన ‘రెండో ఇల్లు’గా పరిగణిస్తాడు.


ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీకే కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో బెంగళూరు ఫ్యాన్స్‌కు కోహ్లీ అంటే ఎనలేని అభిమానం. అలాగే, నిన్నమొన్నటి వరకు ఆర్సీబీ ప్రాతనిధ్యం వహించిన సహచరుడు ఏబీ డివిలియర్స్ అన్నా కూడా అభిమానులకు చెప్పలేనంత ఇష్టం.


నిన్న (శనివారం)  కోహ్లీ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అభిమానులు ‘ఏబీడీ, ఏబీడీ’ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అది విన్న కోహ్లీ.. అభిమానుల వైపు తిరిగి డివిలియర్స్ ఐకానిక్ షాట్‌ను అనుకరించాడు. అంతే.. అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.


కోహ్లీ ఇటీవల ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని ఫా డుప్లెసిస్ భర్తీ చేశాడు. ఈ మేరకు ఆర్సీబీ తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. ఆర్సీబీ తమ కొత్త జెర్సీని కూడా శనివారం ఆవిష్కరించింది. ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌లు ఆడిన డుప్లెసిస్ 2,935 పరుగులు చేశాడు. ఇందులో 22 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 96 పరుగులు. 



Updated Date - 2022-03-13T22:28:56+05:30 IST