వివిధ రూపాల్లో ‘ఉక్కు’ ఆందోళనలు

ABN , First Publish Date - 2021-03-01T09:03:16+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ ప్రవేటీకరణను నిరసిస్తూ ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ ఉద్యమ స్ఫూర్తితో వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించాలని వివిధ పార్టీల

వివిధ రూపాల్లో ‘ఉక్కు’ ఆందోళనలు

చల్లపల్లి, ఫిబ్రవరి 28: స్టీల్‌ప్లాంట్‌ ప్రవేటీకరణను నిరసిస్తూ ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ ఉద్యమ స్ఫూర్తితో వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించాలని వివిధ పార్టీల నేతలు తీర్మానించారు. కృష్ణాజిల్లా చల్లపల్లిలో ఆదివారం సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్‌బాబు, రైతుసంఘం కార్యదర్శి గొరిపర్తి రామారావుల అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ మరో ఉద్యమానికి అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మార్చి 5న రాష్ట్రబంద్‌ను జయప్రదం చేయటం, అంబేడ్కర్‌ విగ్రహాల ఎదుట నిరసనలు, కరపత్రాల ద్వారా ప్రచారం, ‘చలో విశాఖ’ కార్యక్రమాలు నిర్వహించేందుకు తీర్మానించారు. 

Updated Date - 2021-03-01T09:03:16+05:30 IST