పొలాల్లోకి దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-04-22T13:19:37+05:30 IST

జిల్లాలోని ఎలమంచిలి కొత్తపాలెం సమీపంలో ఓ కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది.

పొలాల్లోకి దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి

విశాఖపట్నం: జిల్లాలోని ఎలమంచిలి కొత్తపాలెం సమీపంలో ఓ కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-04-22T13:19:37+05:30 IST