పాడేరు ఐటిడిఎ వద్ద గిరిజన జేఏసీ ధర్నా

ABN , First Publish Date - 2021-07-14T18:15:40+05:30 IST

పాడేరు ఐటిడిఎ వద్ద గిరిజన జేఏసీ బుధవారం ధర్నాకు దిగింది.

పాడేరు ఐటిడిఎ వద్ద  గిరిజన జేఏసీ ధర్నా

విశాఖపట్నం: పాడేరు ఐటిడిఎ వద్ద  గిరిజన జేఏసీ బుధవారం ధర్నాకు దిగింది. జీఓ నెం.3పై ప్రభుత్వం జారీ చేసిన మెమోకు నిరసనగా ధర్నా చేపట్టారు. జీఓ నెం.3 రిజర్వేషన్ పునరుద్ధరణకు చట్టం చేయాలని డిమాండ్ చేశారు. జీఓ నెం.3 రిజర్వేషన్ రద్దపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను వెంటనే రద్దు చేయాలన్నారు. ఆదివాసులకు ప్రత్యేక జాబ్ కాలెండర్ ప్రకటించాలని, షెడ్యూల్ ప్రాతంలో ప్రత్యేక ఉద్యోగ నియమకాచట్టం చేయాలని, షెడ్యూలు ప్రాంతంలో ప్రత్యేక డీఎస్పీని ప్రకటించాలని గిరిజన జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-07-14T18:15:40+05:30 IST