విశాఖలో బీజేపీ గిరిజన మోర్చా కార్యవర్గం భేటీ
ABN , First Publish Date - 2021-07-15T16:51:07+05:30 IST
విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది.
విశాఖపట్నం: విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. బీజేపీ జాతీయ గిరిజన మోర్చా అధ్యక్షులు సమీర్ ఓరాణ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమీర్ ఓరాణ్ మాట్లాడుతూ గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ప్రధాని మోదీ గిరిజనుల అభ్యున్నతికి తోడ్పడుతున్నారని తెలిపారు. కేంద్రంలో ప్రేవేశపెట్టిన పథకాలు చివరి వ్యక్తి వరకు అందిస్తున్నారన్నారు. మోదీ ప్రేవేశపెట్టిన పథకాలు ప్రజలలోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. కరోనా విపత్కర పరిస్థితులలో మోదీ ఆత్మనిర్బర భారత్ ద్వారా దేశ ప్రజలను ఆదుకున్నారన్నారు. ఈ సమావేశంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఉమ మహేశ్వరరావు, ఎమ్మెల్సీ మాధవ్, గిరిజన మోర్చా సభ్యులు పాల్గొన్నారు.