మైండ్ లెస్ సీఎం జగన్: టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షులు

ABN , First Publish Date - 2021-07-21T18:10:11+05:30 IST

నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని టీఎన్ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ విమర్శించారు.

మైండ్ లెస్ సీఎం జగన్: టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షులు

విశాఖపట్నం: నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని టీఎన్ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ విమర్శించారు. జీవో నెం.39 జీవో వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి..ఇప్పుడు కేవలం 10 వేల ఉద్యోగాలే ఇస్తున్నారని మండిపడ్డారు. మైండ్ లెస్ సీఎం జగన్ అని వ్యాఖ్యానించారు. ఈ నెల 19న సీఎంకు వినతి పత్రం ఇద్దామంటే.. పోలవరంకు పారిపోయారన్నారు. విద్యార్థుల నేతలపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. ఉద్యోగాల భర్తీ చేయనందుకు చనిపోయేందుకు అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి నిరుద్యోగులు లేఖ రాశారన్నారు. నిరుద్యోగులు ఎవరు చనిపోవద్దని..తాము అండగా ఉంటామని ప్రణవ్ గోపాల్ భరోసా ఇచ్చారు. 

Updated Date - 2021-07-21T18:10:11+05:30 IST