విశాఖలో తెలుగు మహిళల వినూత్న నిరసన
ABN , First Publish Date - 2021-07-23T17:19:13+05:30 IST
విశాఖ టీడీపీ కార్యాలయం ముందు తెలుగు మహిళలు వినూత్నన రీతిలో నిరసనకు దిగారు.
విశాఖపట్నం: విశాఖ టీడీపీ కార్యాలయం ముందు తెలుగు మహిళలు వినూత్నన రీతిలో నిరసనకు దిగారు. విశాఖ పార్లమెంట్ మహిళా కమిటీ ఆధ్వర్యంలో వంటగ్యాస్ ధరలు, నిత్యావసర, వస్తువుల ధరలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. నిత్యవసర ధరల పెరుగుదలను నిరసిస్తూ... కట్టెల పొయ్యిపై వంటా వార్పు నిర్వహించారు. ధరలు తగ్గించాలని ప్లకార్డులు ప్రదర్శన ఇస్తూ నినాదాలు చేశారు.