జీవీఎంసీ కార్యాలయంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ చాంబర్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-08-27T16:57:49+05:30 IST
విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ చాంబర్ శుక్రవారం ప్రారంభమైంది.
విశాఖపట్నం: విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ చాంబర్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మేయర్ గొలగాని హరివెంకట కుమారితో పాటు మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి, విశాఖ టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ను నేతలు అభినందించారు.