విశాఖలో ఎంసెట్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-09-09T16:43:37+05:30 IST
విశాఖలో ఎంసెట్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది.
విశాఖపట్నం: విశాఖలో ఎంసెట్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. ఎంసెట్ ఫలితాల్లో ఎక్కువ ర్యాంకు వచ్చిందని మనస్థాపం చెందిన విద్యార్థి శానిటైజర్ తాగి బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే గుర్తించిన తల్లిదండ్రులు విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు.