విశాఖలో రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2020-11-28T16:20:44+05:30 IST
విశాఖలోని లంకెలపాలెం జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
విశాఖపట్నం: విశాఖలోని లంకెలపాలెం జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లంకెలపాలెం పెట్రోల్ బంకు వద్ద బైకుపై వెళ్తున్న తల్లీకొడుకును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా కొడుకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.